96MEDIA – #AP INDIA

స్కై మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చాటిన విశాఖ క్రీడాకారుడు ప్రవీణ్

96మీడియా,విశాఖపట్నం:- స్కై మార్షల్ ఆర్ట్స్ లో విశాఖ క్రీడాకారుడు సత్తా చాటాడు.

అక్టోబర్ 28 తారీకు నుంచి నవంబరు 8 తారీకు వరకు గోవాలో జరిగిన 37 నేషనల్ గేమ్స్ లో స్కై మార్షల్ ఆర్ట్స్ లో 50 కేజీల విభాగంలో పోతిన ప్రవీణ్ సిల్వర్ మెడల్ సాధించారని స్కై మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొద్దపు బంగార్రాజు

తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది క్రీడాకారులు స్కై మార్షల్ ఆర్ట్స్ కి ఎంపికగా విశాఖపట్నం జిల్లా నుంచి ప్రవీణ్ ఒక్కడు మాత్రమే ఎంపిక అయి విశాఖ కీర్తిని గోవాలో రెపరెపలాడించారని విశాఖపట్నం జిల్లా స్కై మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ సెక్రెటరీ మరియు కోచ్ w అప్పల రాము గారు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను ఎంపిక చేసి నేషనల్ గేమ్స్ లో పాల్గొనే అవకాశం కల్పించిన నా కోచ్ అప్పల రాము గారికి జీవితాంతం రుణపడి ఉంటానని ఈ విజయాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నాననితెలిపారు అలాగే అన్నివేళలా ప్రోత్సహిస్తూ నాకు సపోర్ట్ గా ఉంటున్న స్కై మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్ ఆబోతు అప్పల రాము గారికి, టీం మేనేజర్ గవర ఈశ్వర్ రావు గారికి, గో ల్జాన రవి కుమార్ గారికి ,రౌతు శ్రీను గారికి, గుర్ల విజయ్ కుమార్ గారికి,కాకర సురేష్ కుమార్ గారికి, బొద్దపు సంతోష్ గారికి,జోగా ధనుష్ గారికి,kk. రాజు గారికి,శియ్యాద్రి అప్పారావు గారికి, అక్కిరెడ్డి దేముడు బాబు గారికి , లెంక మధు గారికి, రొంగళి వెంకటేశ్వర్ రావు (వెంకట్ ) గారికి, ప్రతి ఒక్కరికి పేరుపేరునా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More